మహానాడు సందర్భంగా కార్యకర్తలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం అంటూ చంద్రబాబు ప్రకటించారు. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అన్నారు. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం అని వివరించారు.

ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం అన్నారు. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు.
–