వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. జూన్ 12 వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణి కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు పోలీసులు.

ఇది ఇలా ఉండగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణి కేసులో వల్లభనేని వంశీ ని రెండు రోజుల కస్టడీకి కోరారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ తరుణం లోనే వంశీ కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించింది నూజివీడు కోర్టు. మరోవైపు.. వంశీపై మరోసారి పీటీ వారెంట్ జారీ అయింది. అక్రమ మైనింగ్ కేసులో పీటీ వారెంట్ గడువు ముగియడంతో మరోసారి దాఖలు చేశారు పోలీసులు. ఇది ఇలా ఉండగా వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. జూన్ 12 వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.