థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి అంటూ.. పవన్ కళ్యాణ్ పై ఆర్. నారాయణమూర్తి ఫైర్ అయ్యారు. సినిమా థియేటర్ల బందు విషయంలో.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు సరిగ్గా లేదని పరోక్షంగా విమర్శలు చేశారు ఆర్ నారాయణ మూర్తి. హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు ఎవరు కూడా ప్రయత్నాలు చేయలేదని తేల్చి చెప్పారు.

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. చవకగా దొరికే వినోదం ఖరీదుగా మారిందన్నారు. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు అని హెచ్చరించారు. హాలీవుడ్ లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని తెలిపారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదని వెల్లడించారు. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి… ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుందని హెచ్చరించారు.