ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో డిపోలో, ఆర్టీసీ బస్టాండ్లు, టెర్మినల్స్ నిర్మాణానికి 165 ఎకరాల భూమిని కేటాయించాలని సిఆర్డిఏను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది నగరాలలో డిపోలు, బస్టాండ్లు, టెర్మినల్స్ నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు.

విజయవాడ, గుంటూరు లాంటి నగరాలకు రాకపోకలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మూడు ఇంటర్ చేంజ్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని తొందర్లోనే ప్రారంభించామన్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగానే రేషన్ షాప్ ల వద్ద క్యూఆర్ కోడ్ ను ఏర్పరిచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే స్కాన్ చేసి కంప్లైంట్ చేయాలని సూచనలు చేశారు.