అనుష్క హీరోయిన్ గా నటించిన వేదం సినిమా విడుదలై నిన్నటికి 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అనుష్కకు సంబంధించిన వేదం సినిమాలోని ఓ పోస్టర్ ను గోడలపై అంటించారు. ఆ పోస్టర్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అందులో అనుష్క వెనక్కి కొంటెగా చూస్తున్న ఫోటోను పెద్ద హోర్డింగ్ చేసి హైదరాబాదులోని పంజాగుట్ట సెంటర్ వద్ద అంటించారు. అందులో అనుష్క చాలా హాట్ గా, అందంగా ఉంది.

ఈ ఫోటోని చూస్తూ పంజాగుట్ట లోని సెంటర్ వద్ద 40 మైనర్ యాక్సిడెంట్లు అయ్యాయని పాలమూరు నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ విషయంపై పోలీసులు జోక్యం చేసుకొని అనుష్క ఫోటోలు తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ విషయం తెలిసి అనుష్క అభిమానులు ఫైర్ అవుతున్నారు. తన అందాన్ని చూసి యాక్సిడెంట్ చేసుకుంటే అందులో అనుష్క తప్పేముంది ఇలా ఫోటోను తొలగించడం ఏంటి అని సీరియస్ అవుతున్నారు.