తెలంగాణ రాష్ట్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు రూ. 38.5 కోట్లు స్త్రీ నిధికి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 13,137 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఆమోదం తెలిపారు.
మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫేజ్ 2B ప్రాజెక్టులో భాగంగా 86.1 కిలోమీటర్లకు రూ.19579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల జాయింట్ వెంచర్ తో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.