కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. వాటిలో భాగంగా గ్రామీణ పేదల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా, పథకాల ద్వారా పొదుపును అందజేసి ఆర్థికంగా సహాయం చేస్తోంది. వాటిలో భాగంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర స్కీంను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ స్కీం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా ఒక లక్ష రూపాయలను పెట్టుబడి పెట్టడం వలన రెండు లక్షల రూపాయల వరకు పొందవచ్చు. చాలామంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బులను దాచుకోవడానికి మరియు పథకాలను పొందడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన పథకాలలో పెట్టిన డబ్బులు కూడా ఎంతో సురక్షితంగా ఉంటాయని చాలా శాతం మంది భావిస్తారు.
కనుక, ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఎంతో సురక్షితంగా మీ డబ్బులు రెండింతలు అవుతాయి. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు పెట్టుబడి చేయవచ్చు. దీనిలో భాగంగా 115 నెలల పాటు డబ్బులను ఫిక్స్ డిపాజిట్ చేయాలి. దీనికి సంబంధించిన కనీస పెట్టుబడి 1000 రూపాయలు . ఈ పథకానికి సింగిల్ హోల్డింగ్ టైప్, ఏ సర్టిఫికెట్, బి సర్టిఫికెట్ అనే మూడు రకాలు ప్రవేశ పెట్టడం జరిగింది.సింగిల్ హోల్డింగ్ టైప్ సర్టిఫికెట్ లో భాగంగా పెట్టుబడి చేయాలంటే మైనర్ లేదా ఇతర వ్యక్తి పేరునా సర్టిఫికెట్ ను పొందవచ్చు. అతని పేరునా డబ్బును పొదుపు చేయడం వలన భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు.
ఏ సర్టిఫికెట్ లో భాగంగా పెట్టుబడి చేయడానికి జాయింట్ అకౌంట్ సర్టిఫికెట్ ను జారీ చేయాల్సి ఉంటుంది. జాయింట్ సర్టిఫికెట్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరికైనా డబ్బులు సంయుక్తంగా చెల్లించడం జరుగుతుంది. ఎలాంటి ప్రమాదం వలనైనా ఒకరు చనిపోతే, మరొక వ్యక్తికి డబ్బులను అందించుతారు. బి సర్టిఫికెట్ లో కూడా జాయింట్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు భారత పౌరులు అయ్యుండాలి మరియు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కిసాన్ వికాస్ పత్ర ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా పొదుపుతో పాటు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు.`