Another case registered against former minister Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. కృష్ణపట్నం పోర్టుకి వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి అక్రమ వసూళ్లకి పాల్పడ్డారని ఫిర్యాదు చేసారు.

ఈ మేరకు కేసు నమోదు చేశారు ముత్తుకూరు పోలీసులు. ఇక అటు కాకాణి పోలీస్ కస్టడీ ముగిసింది. రుస్తుం మైనింగ్ కేసులో మూడు రోజుల పాటు కాకాణిని ప్రశ్నించారు అధికారులు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో విచారణ చేశారు. వైద్య పరీక్షల కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. కృష్ణపట్నం పోర్టుకి వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి అక్రమ వసూళ్లకి పాల్పడ్డారని ఫిర్యాదు చేసారు.