తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం అవుతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సభలు నిర్వహించే తేదీలపై ఈ భేటీలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.