Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తరుణంలో 10 నిమిషాల ఆలస్యం.. ఓ యువతి ప్రాణాలను కాపాడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యం కావడంతో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది భూమి చౌహాన్ అనే మహిళ. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్ AI171ను బుక్ చేసుకుంది భూమి చౌహాన్.

అయితే ఎయిర్ పోర్ట్ కు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పది నిమిషాలు ఆలస్యం అయింది. అప్పటికే టేకాఫ్ అయ్యి ఫ్లైట్ కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటన తనను ఒళ్లు గగుర్పొడిచేలా చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది భూమి చౌహాన్. తనను వినాయకుడే కాపాడాడు అని పేర్కొంది.