ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేస్తూ సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.

జూలై 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అంధులు, వికలాంగుల పిల్లల తల్లిదండ్రులకు, ఇతర తీవ్ర అనారోగ్యాలు ఉన్నవారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే దగ్గర ప్రాంతాలకు బదిలీ చేస్తామని చెబుతున్నారు.