ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందజేసింది. ఒక్కొక్కరికి రూ. 5 వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు ఇస్తామని వెల్లడించారు. శ్రీనిధి ద్వారా 2025-26 నాటికి రూ. 5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు.

సిఐఎఫ్ రుణాలను స్త్రీ నిధి ద్వారానే అందించామని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీ నిధి నిధులను మళ్లించిన వారిపై విచారణ చేపడతామని అన్నారు. అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో డ్వాక్రా గ్రూపులలో డబ్బులు తీసుకునే మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.