ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సత్య సాయి జిల్లా సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు ఒకసారిగా చెలరేగాయి. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఈ సంఘటన జరిగింది. రైలులో భోగి చక్రాల మధ్యలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు… గట్టిగా కేకలు వేయడం జరిగింది.

ఇక చేసేదేమీ లేక రైల్వే అధికారులు వెంటనే ఆ రైలును ఆపేశారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ సంఘటనపై.. ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విమానాలు అలాగే రైల్వే ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విమానం అలాగే రైలు ప్రయాణాలు చేయాలంటే భయపడిపోతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు
ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఘటన
రైలులో బోగి చక్రాల మధ్యలో మంటలు.. గట్టిగా కేకలు వేసిన ప్రయాణికులు
రైలు ఆపి తనిఖీలు చేసిన రైల్వే అధికారులు.. మంటలు ఆర్పివేసిన సిబ్బంది #AndhraPradesh #SriSathyaSaiDistrict #Train… pic.twitter.com/jWfdQNKrVX
— Telugu Feed (@Telugufeedsite) June 17, 2025