టాలీవుడ్ స్టార్ నటులు మంచి మోహన్ బాబు అలాగే మంచి విష్ణులకు ఊహించని షాక్ తగిలింది. మంచు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు అలాగే పేర్లు ఉన్నాయని…. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు పిటిషన్ విచారించి… మంచు విష్ణు, మోహన్ బాబు లకు షాక్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, బ్రహ్మానందం అలాగే సప్తగిరి లకు కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరితోపాటు సిబిఎఫ్సీ ప్రాంతీయ అధికారికి, ఏపీ ఎఫ్ సి సి కి అటు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ నోటీసులు పంపింది హైకోర్టు. ఈ పిటిషన్ విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. ఇది ఇలా ఉండగా… మంచు విష్ణు హీరోగా చేసిన కన్నప్ప సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.