అమరావతిలో దారుణం వరుస పవర్ కట్స్‌.. సబ్‌స్టేషన్‌పై యువకుల దాడి

-

వరుస పవర్ కట్స్‌తో చిర్రెత్తుకొచ్చి.. సబ్‌స్టేషన్‌పై యువకులు దాడి చేశారు. మహారాష్ట్రలోని అమరావతి పరిధిలో ఉన్న వాల్గావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక రోజు రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి స్థానికులు గురయ్యారు. సమయం, సందర్భం లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కట్ చేస్తున్నారు అధికారులు.

Youths attack substation after series of power cuts
Youths attack substation after series of power cuts

ఈ తరుణంలోనే కోపాద్రిక్తులై సబ్ స్టేషన్‌పై యువకులు దాడి చేశారు. పెట్రోల్ పోసి టేబుల్‌కి నిప్పు పెట్టారు. ఇక సిబ్బంది ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు స్థానిక పోలీసులు. వరుస పవర్ కట్స్‌తో చిర్రెత్తుకొచ్చి.. సబ్‌స్టేషన్‌పై యువకులు దాడి చేసిన సంఘటన వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news