ఏపీ, తెలంగాణకు రెడ్ అలెర్ట్.. 3 నుంచి 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు !

-

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే మూడు నుంచి ఐదు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

rain ap Telangana
rain ap Telangana

కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉందని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news