తెలంగాణ రైతులకు అలర్ట్… నేడే చివరి తేదీ

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలెర్ట్. రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరితేదీ. దింతో ఇప్పటి వరకు కొత్తగా 5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2023 – 25 వరకు రాష్ట్రంలో 12 వేల భూములకు రిజిస్ట్రేషన్లు, గత సంవత్సరం 5 లక్షలకుపైగా రిజస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొన్నారు అధికారులు.

rythu bandh
rythu bandh

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు ఏఈఓలు. ఈ తరుణంలోనే రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరి తేదీ అని అధికారులు తెలిపారు. దీనికోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. rythubharosa.telangana.gov.in/ నుంచి కూడా ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక అటు 5 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. దింతో 4 లక్షల 43 వేల 167 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.1189.43 కోట్ల నిధులు విడుదల చేసింది సర్కార్. ఇప్పటి వరకు 19 లక్షల 82, 392 ఎకరాలకు రైతు భరోసా అందింది. ఇప్పటి వరకు 62 లక్షల మంది రైతులకు రూ 6404.70 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news