ఫోన్ ట్యాప్ పై గోనె ప్రకాష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్, సంతోష్ కుమార్ కవిత ఫోన్ ట్యాప్ చేశారని బాంబు పేల్చారు గోనె ప్రకాష్ రావు. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్ తెలిసే జరిగిందని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్.. కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారని ఆరోపణలు చేశారు గోనె ప్రకాష్ రావు.

ఓటు కు నోటు విషయంలో కూడా BRS నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా BRS ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని వెల్లడించారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు గోనె ప్రకాష్ రావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గోనె ప్రకాష్ రావు.