తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి, పట్టుదలకు ప్రతిరూపంగా చూడాలన్నారు BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను కల్పించిన విజయగాథ తెలంగాణ అన్నారు. లండన్ ఆక్స్ ఫర్స్ యూనివర్సిటీలో ఆక్స్ ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ప్రపంచలోనే అతిపెద్ద 5 టెక్ దిగ్గజ కంపెనీల ఆఫీసులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు.
బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగానే కేసీఆర్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పుకోవాలన్న కేటీఆర్, 70 వేల రైతుల ఖాతాల్లో సుమారు 75 వేల రూపాయలను జమచేసిన ఏకైక నాయకుడు స్వతంత్ర్య భారతచరిత్రలో కేసీఆర్ ఒక్కడే అన్నారు. ఇంతేకాదు కోటి ఇండ్లకు శుద్దిచేసిన తాగునీటిని అందించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు పదవిలో ఉంటే ఏం జరుగుతుందో అనడానికి తెలంగాణ సాధించిన విజయాలే సాక్ష్యం అన్నారు. ఈ ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు అన్న కేటీఆర్ తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.