తిరుమలలో కిక్కిరిసిన భక్తులు.. శిలా తోరణం వరకు క్యూ లైన్

-

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ తిరుమలలో విపరీతంగా భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారు. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయానికి పైనే పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,087 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, 41,891 మంది తలనీలాలు సమర్పించారు.

tirumala
tirumala

నిన్న శ్రీవారికి ఉండి ఆదాయం రూ. 4.3 కోట్లు వచ్చినట్టుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా నిన్న క్యూ లైన్ లలో నిలుచున్న భక్తులకు కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. దీనిపై ఇప్పటివరకు టీటీడీ పాలకమండలి అధికారులు చర్యలు తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news