లాల్ దర్వాజా బోనాల షెడ్యూల్ విడుదల అయింది. పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ మహాకాళి 117వ బోనాలు జాతర ఉత్సవాలు జూలై 11వ తేదీ నుంచి వైభవంగా జరిపిస్తామని లాల్ దర్వాజా దేవాలయ చైర్మన్ బి. మారుతీ యాదవ్ వెల్లడించారు. బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో కన్వీనర్ అరవింద్ గౌడ్ తో కలిసి మాట్లాడారు. జూలై 20న అమ్మవారికి బోనాలు సమర్పణ, శాంతి కల్యాణం జరుగుతుందని తెలియజేశారు.

జూన్ 30, జూలై 1, 2 తేదీలలో ఢిల్లీ తెలంగాణ భవన్ లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పంటలు బాగా పండాలని రైతులు అమ్మవారికి బోనాలు చేస్తారు. ఈ ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.