అమెరికా సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసిన తర్వాతే అమెరికా వీసా ఇచ్చే0దుకు నిర్ణయం తీసుకుంది. “ప్రైవేట్”లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు “పబ్లిక్”గా మార్చాలని, ఆ అకౌంట్లు పర్యవేక్షించిన తరువాతనే వీసా జారీ చేస్తామని ప్రకటించింది అమెరికా రాయబార కార్యాలయం.

తమ దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి రానున్నట్టు ప్రకటించింది భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం. అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్లను “పబ్లిక్” గా మార్చాలని పేర్కొన్న అమెరికా రాయబార కార్యాలయం…. సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసిన తర్వాతే అమెరికా వీసా అని తెలిపింది.