టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఢిల్లీకి వెళ్లి ఉపరాష్ట్రపతి జగదీప్ ను కలవడమే.. ఈ వార్తకు ఆజ్యం పోసింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో మీనా లాంటి హీరోయిన్ ను… ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తోందట.

సౌత్ ఇండియా మొత్తం.. హీరోయిన్ మీనా అంటే పడి చచ్చిపోతారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆమెను పార్టీలోకి తీసుకువచ్చి… ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఢిల్లీకి వచ్చి ఉపరాష్ట్రపతిని కలిసినట్టు చెబుతున్నారు. అతి త్వరలోనే ఆమె బిజెపి తీర్థం పుచ్చుకొని ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.