తమిళనాడులో జరిగిన మురుగన్ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. దీంతో సినీ నటుడు సత్యరాజ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని సత్య రాజ్ అన్నారు. పెరియార్ సిద్ధాంతాలు నమ్ముకున్న మమ్మల్ని ఎవరూ కూడా మోసం చేయలేరని సంచలన కామెంట్లు చేశారు.

ఒకవేళ మీరు తమిళనాడు ప్రజలను మోసం చేశామని అనుకుంటే మాత్రం అది మీ తెలివి తక్కువ తనమేనని అన్నారు. తమిళ ప్రజలు చాలా తెలివైన వారు. వారి ముందు ఎవ్వరి ఆటలు సాగవంటూ సత్యరాజ్ పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో సత్యరాజ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.