శోభనం రోజు ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. భర్తకు భార్య వార్నింగ్

-

నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానంటూ శోభనం రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తకు వార్నింగ్ ఇచ్చింది భార్య. కేదార్‌నాథ్ యాత్రకు తీసుకు వెళ్ళమని అడిగింది యువతి. అనంతరం కొద్దిరోజులకు వరసకు మేనల్లుడైన యువకుడితో లేచిపోయింది మహిళ.


ఉత్తరప్రదేశ్ – ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరగగా, మొదటి రాత్రి రోజు తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పింది యువతి. తన భార్య సితార, వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని పేర్కొన్నాడు భర్త. తన ప్రేమికుడు అమన్ మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు నిషాద్.

సితార తనను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని చెప్పిన నిషాద్… మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news