సింగయ్య మృతి కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో వేసిన పిటిషన్ ను వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. వైసిపి కార్యకర్త సింగయ్య మృతి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇందులో A2 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని చేర్చింది కూటమి సర్కార్.

ఈ తరుణంలోనే… ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరుగుతుందనే సమయానికి.. జగన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ పిటిషన్ పై…. విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. కానీ కోర్టు మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.