తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కన్నతల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వరంగల్ జిల్లా సంఘం మండలం కుంటపల్లి లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి పైన పెట్రోల్ పోసి అంటించాడు.

ఈ నేపథ్యంలో తల్లి వినోద పరిస్థితి విషమంగా మారింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి కూడా తరలించారు. ఆస్తి పంపకాల విషయంలో కొడుకు సతీష్… ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పరారీలో సతీష్ ఉన్నట్లు తెలుస్తోంది.