మా వ్యతిరేకులను అందరినీ పొంగులేటి ఏకం చేస్తున్నాడు – కొండా మురళి

-

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళా మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. తన వ్యతిరేకులు అందరినీ ఏకం చేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు.

KONDA MURALI ON PONGULETI
KONDA MURALI ON PONGULETI

ఈ నేపథ్యంలోనే కొండా మురళి ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. కాసేపటి క్రితమే గాంధీ భవన్ చేరుకొని.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కొండ మురళి హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి తమపై కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడట. మా వ్యతిరేకులు అందరినీ ఏకం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలిపాడని వార్తలు బయటకు వచ్చాయి. మంత్రి సీతక్కతో మాకు ఎలాంటి విభేదాలు లేవని కొండ మురళి ఈ సందర్భంగా వెల్లడించారట.

Read more RELATED
Recommended to you

Latest news