BRS శాంతి యుతంగా ఉండాలి… మహా న్యూస్ ఘటనపై కేటీఆర్ !

-

మహా న్యూస్ ఘటన పై కేటీఆర్ స్పందించారు. శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావుండకూడదని మండిపడ్డారు. ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్‌స్ట్రీమ్‌కి తీసుకు వచ్చిన మన గుంపుమేస్త్రి ముఖ్యమంత్రి, ఆయన మిత్రులకే ఈ పాపం అని ఆగ్రహించారు.

ktr on maha news
ktr on maha news

బీఆర్‌ఎస్ పార్టీ సోదర, సోదరీమణులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను…. పార్టీపైన ముఖ్యమంత్రి మరియు ఆయన అనుచర గణం చేస్తున్న బురదల్లే కుట్రపూరిత కార్యక్రమంపై చట్టబద్ధమైన ప్రక్రియను నమ్మి ముందుకు సాగుదామన్నారు. పార్టీపైన మీకు ఉన్న ప్రేమను, నిబద్ధతను నేను పూర్తిగా అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అదే విధంగా, పార్టీపై, నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారంపై మీలో ఉన్న ఆవేదనను కూడా నేను అర్థం చేసుకోగలను…. రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ దొంగ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం అంశాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయి.. ఆరాచకత్వం పెట్రేగిపోతుందని ఆగ్రహించారు. మనందరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలపై, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలపై ప్రశ్నించడంపైనే దృష్టి సారించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news