తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ బస్సు నడిపిన డ్రైవర్ మత్తులో ఉన్నట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. మరికొంతమంది అతివేగం కారణంగా ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.