మహా టీవీ న్యూస్ ఛానల్ పై జరిగిన దాడి సంఘటనపై తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా న్యూస్ ఒక్కటే కాదు.. ఇలా ఇంకో మూడు ఛానెల్స్ వరకు ఉన్నాయని వాళ్ల అంతు కూడా చూస్తామని హెచ్చరించారు. కెసిఆర్ క్షమించినా కూడా మేము మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

మీ బలుపు ఏంది.. మీ ఆహారం ఏందీ… ఎవడిని చూసుకొని రెచ్చిపోతున్నారు అంటూ ఓ రేంజ్ లో జగదీశ్వర్ రెడ్డి రెచ్చిపోయారు. ఎక్కడ ఉంటున్నారు… ఏడ బతుకుతున్నారు… కొంచమైనా సిగ్గుందా అని ఫైర్ అయ్యారు. ఇక్కడ కొంతమంది మీడియా హౌజెస్ కాకుండా స్లాటర్ హౌసులు నడుపుతున్నారని రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను కొట్లాడి తెచ్చినందుకు… కెసిఆర్ పై కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీశ్వర్ రెడ్డి.
కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం
నిన్న మహా న్యూస్ చానల్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే
ఇంకో రెండు, మూడు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తాం.. మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు
మీ బలుపు ఏంది.. మీ అహంకారం ఏంది
ఎవడ్ని చూసుకొని… pic.twitter.com/Z0EeJNySgw
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2025