తెలంగాణ విద్యార్థులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలోని వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందజేసింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ ను 15 శాతం పెంచుతున్నట్లుగా స్పష్టం చేసింది. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఈ విషయం పట్ల ఆర్థికంగా ఊరట లభిస్తోంది.

అంతేకాకుండా వైద్యరోగ్య శాఖలో పనిచేస్తున్న 16, 448 మంది ఉద్యోగుల సర్వీసును మరో సంవత్సరం పాటు పోడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూడాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మేడికోలకు భారీగా స్టైఫండ్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.