స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. జిల్లా నియోజకవర్గస్థాయి ప్రణాళికల తయారీలో కొంతమంది పాల్గొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అనంతపురం, అన్నమయ్య, విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగులు బదిలీల కౌన్సిలింగ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పారదర్శకత లేదని ఆరోపణలు చేస్తున్నారు.

మరోవైపు కార్పొరేషన్, మున్సిపల్ ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా వేరే వార్డులకు బదిలీ చేయబోతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ఉచిత ప్రదేశాలకు జూలై రెండు వరకు గడువును పొడిగించారు. ఇదిలా ఉండగా…. ఏపీలో దివ్యాంగుల పింఛన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అక్రమంగా కొంతమంది సర్టిఫికెట్ పొందినట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించి లక్ష మందిని అనర్హులుగా ప్రకటించింది. దళారులు, వైద్యులు కలిసి ఒక్కో సర్టిఫికెట్ మీద రూ. 20వేల నుంచి రూ. 30 వేల వరకు డబ్బులు వసూలు చేశారని అనేక రకమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకుంటుంది.