భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య… కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపింది. కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో శంకరమూర్తి, సుమంగళి దంపతులు నివసిస్తున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటిమిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది సుమంగళి.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసింది సుమంగళి. ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి, భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కారంపొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించి భార్యను విచారించారు పోలీసులు. తానే హత్య చేశానని విచారణలో అగీకరించడంతో, భార్య ప్రియుడిని అరెస్టు చేశారు పోలీసులు.