రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్. ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచే ఛార్జీలు అమలులోకి వస్తాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కి.మీకు రూ.2 పైసలు, నాన్ ఏసీలో కి.మీకు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కి.మీ వరకు సాధారణ ఛార్జీలు ఉంటాయి.

501 నుంచి 1500 కి.మీ వరకు టికెట్పై రూ.5..1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్పై రూ.10.. 2501 నుంచి 3000 కి.మీ వరకు రూ.15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు అరపైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్(నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కి.మీకు రూ.2 పైసలు చొప్పున పెంచారు.