రాజాసింగ్ కు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన బీజేపీ పార్టీ… ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనుందట. పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పట్ల బీజేపీ సీరియస్ అయిందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్య పదవికి పోటీచేసేందుకు నామినేషన్ పత్రం ఇచ్చినా, అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీపై తీవ్ర విమర్శలు చేసినందుకు రాజాసింగ్ పట్ల సీరియస్గా ఉందట బీజేపీ హైకమాండ్. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ, అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసేందుకు సిద్ధమైంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. ఇక అటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్… గులాబీ గూటికి వెళుతున్నారని సమాచారం అందుతోంది.