తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ

-

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు. ఆయన కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కింగ్డమ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం జులై 31న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Vijay Devarakonda

అయితే గతంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తప్పు పట్టారు. దీంతో ట్రైలర్ విడుదల వేడుక వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news