తమిళనాడులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు దొంగిలించాడు పంచాయతీ సర్పంచ్. తన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించడం లేదని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది నేర్కుండ్రం నివాసి వరలక్ష్మి(50). కాంచీపురంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్కు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సులో బంగారు గొలుసు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళ.

ఆ దొంగతనం చేసింది మరెవరో కాదని.. బస్సులో వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళే అని గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె తిరుపత్తూరు జిల్లా నార్యంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి(56)గా గుర్తించారు.
ప్రజాసేవలో ఉన్న ఓ మహిళ ఇలా ప్రవర్తించడంతో అవాక్కయ్యారు పోలీసులు. నిందితురాలు భారతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసారు. గతంలో సైతం తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాల్లో భారతిపై దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు.