టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్ లో కేసు నమోదు అయింది. అలిపిరి సమీపంలోని పార్కింగ్ ప్లేస్ వద్ద ఉన్న విగ్రహంపై వివాదం చేశారని భూమనపై టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో… భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పీఎస్ లో కేసు నమోదు అయింది.

కాగా తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే అలిపిరి మార్గంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం వదిలి వెళ్లారని విమర్శలు వైసీపీ పార్టీ చేస్తోంది. మలమూత్రాలు, మద్యం బాటిళ్లు విసిరేస్తున్న ఇలాంటి ప్రదేశంలో స్వామివారి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే.. భూమన కరుణ రెడ్డికి భాను ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరుణ రెడ్డికి బండి తాళాలకు అలాగే గుడి తాళాలకు తేడా తెలియదని ఫైర్ అయ్యారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉందని గుర్తు చేశారు. అది మహావిష్ణు విగ్రహం కాదని.. గత 20 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉందని క్లారిటీ ఇచ్చారు.