తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర్శ‌నాల‌కు ఎన్ని గంట‌లు అంటే

-

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. నడక దారిన వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీరాలు సమర్పించారు.

ttd
ttd

శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 2.86 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా…. తిరుమలలో ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు డిసెంబర్ నెల కోటా విడుదల కానుంది. 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీ డిప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేస్తారు. 22న ఉదయం 10 గంటలకు ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం టికెట్లు, 23న ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోటా, 24న ఉదయం 10 గంటలకు రూ. 300 టికెట్లు, మధ్యాహ్నం మూడు గంటలకు గదుల కోటాను విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news