ప్రతి యువతరం కళలు కనేది మొదట ఉద్యోగానికే, అది వారికీ మంచి సురక్షిత భవిష్యత్తు! యువత కలలను సాకారం చేసే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే పీఎం-సేతు (PM-SETU). దీని పూర్తి పేరు “ప్రధాన మంత్రి నైపుణ్యం మరియు ఉపాధి పరివర్తన ద్వారా అప్గ్రేడెడ్ ఐటీఐలు (Pradhan Mantri Skill and Employment Transformation through Upgraded ITIs)”. ఈ పథకం ముఖ్యంగా పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఆధునికీకరణపై దృష్టి సారించి, యువతకు నాణ్యమైన నైపుణ్యాన్ని అందించి, వారి ఉపాధి అవకాశాలను ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు చూద్దాం.
పీఎం-సేతు పథకం లక్ష్యం మరియు ప్రాధాన్యత: పీఎం-సేతు పథకం యొక్క ముఖ్య లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలు, యొక్క నాణ్యతను పెంచడం మరియు వాటిని ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం. ప్రస్తుతం ఉన్న ఐటీఐలలో పాతబడిన యంత్రాలు, పద్ధతులు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ఆయా సంస్థలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక యంత్రాలు మరియు మెరుగైన శిక్షణా పద్ధతులను అందించనున్నారు. యువతకు కేవలం సిద్ధాంత జ్ఞానం కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇస్తారు. ఈ పథకం యువతకు మెరుగైన ఉపాధి మార్గాలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను పెంచేందుకు దోహదపడుతుంది.

పథకం అమలు మరియు ప్రత్యేకతలు: పీఎం-సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధులను ఐటీఐల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అధునాతన వర్క్షాప్లను ఏర్పాటు చేయడానికి మరియు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగిస్తారు. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే, ఆయా ప్రాంతాల్లోని కంపెనీలకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకొని ఐటీఐ సిలబస్ను దానికి అనుగుణంగా మారుస్తారు. దీనివల్ల శిక్షణ పూర్తయిన వెంటనే యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే అవకాశం పెరుగుతుంది.
భవిష్యత్తుపై ప్రభావం మరియు యువతకు ప్రయోజనం: పీఎం-సేతు పథకం ద్వారా అప్గ్రేడ్ అయిన ఐటీఐల నుండి బయటకు వచ్చే యువతరం కేవలం టెక్నికల్ నైపుణ్యంతోనే కాకుండా, పరిశ్రమకు అవసరమైన ఆధునిక సామర్థ్యాలతో సిద్ధమవుతారు. ఈ కార్యక్రమం నైపుణ్యం, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. ఇది దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను పెంచుతుంది తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుంది. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి ఈ పథకం ఒక బలమైన పునాది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన పీఎం-సేతు పథకం, దేశ యువత భవిష్యత్తుకు ఒక బంగారు వారధి లాంటిది. ఈ పథకం ద్వారా ఐటీఐలు సరికొత్త రూపాన్ని సంతరించుకొని లక్షలాది మంది యువతీయువకులకు నాణ్యమైన విద్య నైపుణ్యం మరియు గౌరవప్రదమైన ఉద్యోగాలు అందించే కేంద్రాలుగా మారతాయి.