కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో.. వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా.. దుమ్మురేపుతున్న ‘అరవింద సమేత’ టీజర్

-

జైలవకుశ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ మూవీ డైరెక్టర్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మామూలుగా అంచనాలు లేవు. ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ కోడై కూస్తున్నది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. రాయలసీయ బ్యాక్ డ్రాప్ నేపథ్యం ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవాళ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ప్రారంభంతోనే జూనియర్ ఎన్టీఆర్ శక్తి సామర్థ్యాల గురించి జగపతిబాబు చెప్పే డైలాగ్స్ అద్యంతం అలరిస్తాయి. ఇక.. ఎన్టీఆర్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మాత్రం టీజర్ కే హైలెట్. కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా నరికేస్తా.. అంటూ సాగే డైలాగ్ తో టీజర్ పూర్తవుతుంది. మొత్తానికి త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ మార్క్ టీజర్ లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ టీజర్ తో ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించనున్నాడని టాక్. ఒక పాత్రలో సిద్ధార్థ్ గౌతమ్ గా, మరో పాత్రలో వీర రాఘవగా కనిపించనున్నాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news