కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10.60 కోట్ల స్కామ్ చేశారు కేటుగాళ్ళు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు చీటర్స్. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనుల పేరు మీద యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు కేటుగాళ్ళు.

2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు మీద ముత్తుకూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్. ఈ భారీ స్కాం లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర పై కూడా అనుమానాలు వ్యాఖ్టం అవుతున్నాయి. దింతో కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం జరిగిందని చర్చ జరుగుతోంది.