Acharya : ఆచార్య ట్రైల‌ర్ రికార్డు.. 24 గంట‌ల్లో 24 మిల‌య‌న్ల వ్యూస్

-

మెగా స్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా సినిమా ఆచార్య. ఈ సినిమా ట్రైల‌ర్ ను మంగ‌ళ వారం సాయంత్రం విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తుంది. టాలీవుడ్ చ‌రిత్ర‌లో మోస్ట్ వ్యూస్ వ‌చ్చిన ట్రైల‌ర్ గా ఆచార్య నిలిచింది. ట్రైల‌ర్ విడుద‌ల అయిన 24 గంట‌ల్లో 24 మిలియ‌న్ల వ్యూస్ ను ఆచార్య సొంతం చేసుకుంది. అలాగే ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ 1 ప్లేస్ లో ఉంది.

దీంతో పాటు లైక్స్ ప‌రంగా 1 మిలియ‌న్ లైక్స్ ను ఈ ట్రైల‌ర్ సాధించింది. కాగ ఈ ఆచార్య సినిమాను కొరిటల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. హీరోయిన్లుగా కాజ‌ల్ ఆగ‌ర్వాల్, పూజా హెగ్డే న‌టిస్తున్నారు. అలాగే కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది.

దీనికి ముందే.. ఆచార్య చిత్ర బృందం మ‌రో ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధం అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన ట్రైల‌ర్ తో ఆచార్య సినిమాకు సూప‌ర్ హైప్ వ‌చ్చింది. రెండో ట్రైల‌ర్ వ‌స్తే.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news