ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన నటి జాన్వీకపూర్‌

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఇటీవల ఫుడ్ పాయిజన్కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తాజాగా ఈరోజు జాన్వీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తండ్రి బోనీ కపూర్‌ తెలిపారు. ‘‘ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా గురువారం జాన్వీ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేర్పించాం. ఆరోగ్యం మెరుగుపడటంతో నిన్న ఉదయం ఇంటికి తీసుకువచ్చాం’’ అని బోనీ కపూర్‌ మీడియాతో చెప్పారు.

వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ పరంగా జాన్వీకపూర్‌ దూసుకెళ్తోంది. ఓవైపు బాలీవుడ్, మరోవైపు టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ భామ హవా మామూలుగా ఉండదు. తాజాగా జాన్వీ గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూతో కలిసి నటించిన చిత్రం ‘ఉలఝ్‌’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ‘దేవర’తో తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలోనూ జాన్వీ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version