స్టేడియంలో అందరి ముందు ప్రీతిజింతా చేసిన పనికి షాక్ లో క్రికెటర్..!

-

షాక్: అందాల భామ ప్రీతిజింతా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి అంబాసిడర్ గా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ 13 పరుగులు చేసి ఢిల్లీ పై విజయం సాధించాడు ఈ విజయంతో ప్లే యాప్స్ ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ గెలిచినా అనంతరం స్టేడియంలో ఉన్న ప్రీతిజింతా ఆనందంతో చేసిన పనికి ఈ యంగ్ క్రికెటర్ షాక్ అయ్యాడు.

శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెన‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్ల సాయంతో 103 ప‌రుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఒంటరిగా పోరాటం చేసి తన ఖాతాలో ఐపీఎల్లో మొదటి శతకాన్ని నమోదు చేశాడు. 31 ప‌రుగుల తేడాతో ఢిల్లీ పై పంజాబ్ విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ ఆశల‌ను స‌జీవంగా ఉంచుకుంది. మ్యాచ్ గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని, బాలీవుడ్ న‌టి ప్రీతీ జింటా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. అక్కడే స్టేడియంలోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కౌగిలించుకుని త‌న సంతోషాన్ని తెలియ‌జేసింది. అనుకోని ఈ కౌగిలింతకు సిమ్రాన్ సైతం ఓకే అయినట్టు తెలుస్తుంది. అనంతరం తమ ఆనందాన్ని పంచుకున్న క్రికెటర్స్ ఒక్క నవ్వుతో ప్రీతిజింతా మొత్తం ఆనందాన్ని చూపించేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news