‘కన్నప్ప’లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

-

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న మూవీ ‘కన్నప్ప’. ఇప్పటికే ఈ చిత్రంలో వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ టీమ్లోకి ఓ బాలీవుడ్ స్టార్ హీరో చేరాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు సోషల్ మీడియాలో అధికారికంగా ఓ పోస్టు పెట్టాడు. బీ టౌన్కు చెందిన కిలాడీ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప టీమ్లో భాగం కాబోతున్నట్లు టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

‘‘సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన భాగం కావడంతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాకు థ్రిల్‌గా ఉంది. మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి’’ అని పోస్టులో పేర్కొంది. స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ పరిశ్రమకి పరిచమయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news