వైర‌ల్‌గా మారిన ‘అల వైకుంఠపురములో’ డిలీట్ సీన్..!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సీనియర్ నటి టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక అంద‌రూ అనుకున్న‌ట్టుగానే సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. మ‌రియు బ‌న్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయినా కూడా చిత్రంలోని పాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిలీటెడ్ సీన్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిలీట్ చేసిన సీన్ అయిన‌ప్ప‌టికీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనంగా దూసుకుపోతుంది.

ఈ సీన్‌లో సుశాంత్ స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్ చేస్తూ బ‌న్నీ ద‌గ్గ‌ర‌కి వ‌స్తాడు. అప్పుడు బ‌న్నీ స‌రదాగా షూట్ చేసిన వీడియోని సుశాంత్‌కి చూపిస్తాడు. అందులో సుశాంత్ అర్జున్‌రెడ్డి త‌ర‌హాలో బాటిల్ ఎత్తి దించ‌కుండా తాగుతుంటే `అర్జున్‌రెడ్డి` బ్యాగ్రౌండ్ స్కోర్ వినిపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సీన్‌కి `అర్జున్‌రెడ్డి పార్ట్ 2` అని బ‌న్నీ పేరు పెట్ట‌డం, ఆ త‌రువాత సీన్‌లో సుశాంత్ లోక‌ల్ బ‌స్ వెన‌కాల ప‌రుగెత్తుతున్న సీన్‌లు తెగ న‌వ్వులు పూయిస్తాయి. మ‌రి ఆ వీడియో మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news