అల్లరి నరేష్ మరో కొత్త ప్రయోగం ..ఈసారి కామెడి కాదు ..!

-

తెలుగు సినీ పరిశ్రమలో హీరో అల్లరి నరేష్ కి ఒక గొప్ప పేరు ఉన్న సంగతి తెలిసిందే. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి కూడా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే అల్లరి అనే సినిమాతో మంచి జాయ్ ఫుల్ హిట్ అందుకున్నాడు. దాంతో ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని అల్లరి నరేష్ గా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్రేజ్ ని పాపులారిటీని అల్లరి నరేష్ సాధించాడు.

 

అయితే రెండేళ్లుగా అల్లరి నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే కంప్లీట్ కామెడీ అంశాలతో సినిమా రాలేదు. గత సంవత్సరం వచ్చిన మహర్షి లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు. కానీ అదీ అంత ఉపయోగపడలేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ కి పూర్తి భిన్నంగా విభిన్నమైన కథ, కథనాలతో ఓ సినిమా చేస్తున్నాడు. సామాజిక అంశంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు “నాంది” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా సామాజిక అంశాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతుండటం విశేషం.

శతమానంభవతి, ఎంత మంచివాడవురా సినిమాల దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక రీసెంట్ గా నాంది సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇక ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడం అల్లరి నరేష్ కి కొత్తేమి కాదు. మరి రెండేళ్ళ గ్యా తర్వాత వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సస్ ని అందుకుంటాడో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news