ర‌‌వితేజ మూవీలో అన‌సూయ పాత్ర ఇదే?

-

బుల్లితెర యాంక‌ర‌మ్మ అన‌సూయ `రంగ‌స్థ‌లం`లో పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో మంచి పేరు తెచ్చుకుంది. గ్లామ‌ర్ పాత్ర‌లే కాకుండా న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌ల్లోనూ కాణించ‌గ‌ల‌న‌ని ఈ మూవీతో నిరూపించింది. దీంతో ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు త‌లుపుత‌డుతున్నాయి. ర‌వితేజ హీరోగా రూపొందుతున్న `ఖిలాడీ` చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది.

ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్‌లు వున్నారు. మీనాక్షీ దీక్షిత్‌, డింపుల్ హ‌యాతీ. ముచ్చ‌ట‌గా మూడ‌వ హీరోయిన్‌గా అన‌సూయ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌తున్న ఈ మూవీకి మ‌రింత గ్లామ‌ర్‌ని అద్దాల‌న్న ప్ర‌య‌త్నంలో భాగంగా అన‌సూయ‌ని ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక చేసుకున్నార‌ట‌.

ఇందులో అన‌సూయ పాత్ర పేరు `చంద్ర‌శేఖ‌`. అగ్ర‌హారంలో వుండే టిపిక‌ల్ బ్ర‌హ్మ‌ణ యువ‌తిగా ఆమె పాత్ర వుంటుంద‌ని తెలిసింది. ప్ర‌స‌త్తుం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లో అన‌సూయ ఈ మూవీ సెట్‌లోకి ఎంట‌ర్ కానుంద‌ట‌. అన‌సూయ ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న `రంగ‌మార్తాండ‌`, మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రాల్లో న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news